గుంటూరు: మైనర్‌పై అత్యాచారం కేసులో వైసీపీ నేత అరెస్ట్

ABN , First Publish Date - 2022-01-26T19:56:25+05:30 IST

మైనర్‌పై అత్యాచారం కేసులో వైసీపీ నేతను పోలీసులు అరెస్ట్ చేశారు.

గుంటూరు: మైనర్‌పై అత్యాచారం కేసులో వైసీపీ నేత అరెస్ట్

గుంటూరు: జిల్లాలో సంచలనం రేకెత్తించిన మైనర్‌పై అత్యాచారం కేసులో వైసీపీ నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంపీ మోపిదేవి అనుచరుడు కన్నా భూశంకర్‌రెడ్డితో పాటు.. మరో ఐదుగురిని గుంటూరు, అరండల్‌పేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో గతంలో 18 మందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఓ మహిళ మాయమాటలు చెప్పి బాలికతో బలవంతంగా వ్యభిచారం చేయించింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 24 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Updated Date - 2022-01-26T19:56:25+05:30 IST