అవినీతిపై జనసేన-బీజేపీ కూటమి పోరాటం: జనసేన నేత

ABN , First Publish Date - 2021-03-05T17:49:31+05:30 IST

జనసేన-బీజేపీ కూటమి అవినీతిపై పోరాటం చేస్తోందని గుంటూరు పార్లమెంటరీ ఇంచార్జి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ శ్రీనివాస్ తెలిపారు.

అవినీతిపై జనసేన-బీజేపీ కూటమి పోరాటం: జనసేన నేత

గుంటూరు: జనసేన-బీజేపీ కూటమి అవినీతిపై పోరాటం చేస్తోందని  గుంటూరు పార్లమెంటరీ ఇంచార్జి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం తెనాలిలో 11వ వార్డు జనసేన పార్టీ ఎన్నికల  కార్యాలయాన్ని శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల పక్షాన ప్రశ్నించడానికి జనసేన పార్టీ పుట్టిందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచక పాలన రాజ్యమేలుతోందన్నారు. అభివృద్ధిపై ఏమాత్రం వైసీపీ ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దోచుకునే దాంట్లో వైసీపీ నాయకులు కొత్త కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారని వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి వచ్చే విధంగా ప్రజలు జనసేన, బీజేపీ కూటమికి ఓట్లు వేయాలని బోనబోయని శ్రీనివాస్ యాదవ్ కోరారు. 


Updated Date - 2021-03-05T17:49:31+05:30 IST