గుంటూరు : వట్టిచెరుకూరు మండలం కోవెలమూడిలో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2020-07-13T18:40:39+05:30 IST

గుంటూరు : జిల్లాలోని చేపల చెరువు వేలం పాట విషయంలో వివాదం చోటుచేసుకుంది.

గుంటూరు : వట్టిచెరుకూరు మండలం కోవెలమూడిలో ఉద్రిక్తత

గుంటూరు : జిల్లాలోని చేపల చెరువు వేలం పాట విషయంలో వివాదం చోటుచేసుకుంది. ఈ నెల 3న వేలంపాట జరగ్గా సుబ్రమణ్యం దక్కించుకున్నాడు. అయితే రాజకీయ వత్తిడితో రెండోసారి వేలంపాట దేవాదాయ శాఖ  నిర్వహించింది. అయితే మొదటి పాటదారుడు సుబ్రమణ్యం అభ్యంతరం వ్యక్తం చేశాడు. దేవాదాయ శాఖ సిబ్బంది, వేలం దారుడు మద్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఉన్నతాధికారుల ఆదేశాలతోనే రెండోసారి వేలం పెట్టామని సిబ్బంది చెబుతున్నారు. ఈ క్రమంలో కొందరు సుబ్రహ్మణ్యం దంపతులుపై దాడికి యత్నించారు. సుబ్రహ్మణ్యం దంపతులను అధికారపార్టీ వర్గం తోసేసింది. తమకు న్యాయం చేయాలని సుబ్రమణ్యం దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోర్టును ఆశ్రయిస్తామని సుబ్రమణ్యం చెబుతున్నాడు.

Updated Date - 2020-07-13T18:40:39+05:30 IST