Guntur: అయ్యన్న వ్యాఖ్యలపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన వైసీపీ

ABN , First Publish Date - 2021-09-18T18:35:54+05:30 IST

వైసీపీ ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, మద్గాలి, ముస్తఫా, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మేయర్ కావటి మనోహార్ శనివారం రూరల్ ఎస్పీని కలిశారు.

Guntur: అయ్యన్న వ్యాఖ్యలపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన వైసీపీ

గుంటూరు: వైసీపీ ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, మద్గాలి, ముస్తఫా, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మేయర్ కావటి మనోహార్ శనివారం రూరల్ ఎస్పీని కలిశారు. శాసనసభ మాజీ స్పీకర్ కోడెల వర్ధంతి సభలో అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. అనంతరం వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడుతూ... అయ్యన్నపాత్రుడు మానవ మృగమని,  బలిసిని అడ్డగాడిదలా మాట్లాడారని విరుచుకుపడ్డారు. అయ్యన్న వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. సీఎం, పోలీసులపై రాజ్యాంగ వ్యవస్థపై నీచంగా మాట్లాడారన్నారు. దళిత మహిళా హోం మంత్రిని కించ పరిచేలా మాట్లాడారని విమర్శించారు. అయ్యన్నపాత్రుడుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. దళితులు, మైనారిటీ అంటే టీడీపీకి చిన్నచూపన్నారు. కులాలు, మతాలను, ప్రాంతాలను రెచ్చగొట్టేలా టీడీపీ కుట్ర రాజకీయలు చేస్తోందని ఆరోపించారు. జగన్ సంక్షేమ పాలనతో టీడీపీ కూసాలు కదిలిపోతున్నాయన్నారు. అయ్యన్నపాత్రుడును తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. నర్సీపట్నంలో అయ్యన్న అక్రమ వ్యాపారాలు అన్ని బయట పెడతామని మేరుగ నాగార్జున హెచ్చరించారు. 

Updated Date - 2021-09-18T18:35:54+05:30 IST