Guntur: జీజీహెచ్లో నాలుగు రోజుల పసికందు మాయం
ABN , First Publish Date - 2021-10-16T16:35:30+05:30 IST
నాలుగు రోజుల పసికందు మాయమైన ఘటన జీజీహెచ్లో చోటు చేసుకుంది. ఈ నెల 13వ తేదీన మహిళ ప్రియాంక బాబుకు జన్మనిచ్చింది. తల్లి పడుకుందని..బాబుని వార్డ్
గుంటూరు: నాలుగు రోజుల పసికందు మాయమైన ఘటన జీజీహెచ్లో చోటు చేసుకుంది. ఈ నెల 13వ తేదీన మహిళ ప్రియాంక బాబుకు జన్మనిచ్చింది. తల్లి పడుకుందని..బాబుని వార్డ్ బయటకు నాయనమ్మ తీసుకుని వచ్చింది. అమ్మమ్మ పసికందును పక్కన పెట్టి నిద్రపోయింది. ఇదే సమయం అనుకున్న దుండగులు బాబుని ఎత్తుకుని పారిపోయారు. నిద్రమత్తులో ఉన్న వారు ఒక్కసారిగా నిద్రలేచి చూసేసరికి బాబు కనిపించలేదు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు పరిశీలిస్తున్నారు.