AP: సర్వే అంటూ వచ్చి.. బంగారు గొలుసు చోరీ

ABN , First Publish Date - 2021-11-28T11:59:59+05:30 IST

సర్వే పేరుతో వచ్చి ఒక మహిళ మెడలోని బంగారు గొలుసు చోరీ చేసిన ఘటన శనివారం ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పుట్టా ఓబయ్య, సామ్రాజ్యం

AP: సర్వే అంటూ వచ్చి.. బంగారు గొలుసు చోరీ

గుంటూరు: సర్వే పేరుతో వచ్చి ఒక మహిళ మెడలోని బంగారు గొలుసు చోరీ చేసిన ఘటన శనివారం ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పుట్టా ఓబయ్య, సామ్రాజ్యం దంపతులు పద్మసాలిపేటలో నివాసం ఉంటున్నారు. శనివారం ఉదయం  ఇద్దరు వ్యక్తులు మోటారుబైకుపై ఇంట్లో ఉన్న పుట్టా సామ్రాజ్యం వద్దకు వచ్చి పింఛనుకు సంబంధించి ఆధార్‌కార్డు తీసుకురావాలని అడిగారు. ఆ వెంటనే ఆమె మెడలోని 3 సవర్ల బంగారు గొలుసు లాక్కుని పరారయ్యారు.  ఆమె కిందపడటంతో తలకు గాయమైంది. ఆమెను బంధువులు చిలకలూరిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-11-28T11:59:59+05:30 IST