Jagan పుట్టినరోజున టీడీపీ కార్యకర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వైసీపీ శ్రేణులు

ABN , First Publish Date - 2021-12-21T19:41:58+05:30 IST

గుంటూరు: నగరంలో వైసీపీ కార్యకర్తలు అరాచకం సృష్టించారు.

Jagan పుట్టినరోజున టీడీపీ కార్యకర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వైసీపీ శ్రేణులు

గుంటూరు: నగరంలో వైసీపీ కార్యకర్తలు అరాచకం సృష్టించారు. టీడీపీ కార్యకర్త వెంకటనారాయణపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. జీజీహెచ్‌కు తరలించారు. హోంమంత్రి సొంత నియోజకవర్గం పత్తిపాడు మండలపరిధిలోని బోయపాలెం జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. వైసీపీ శ్రేణులు మద్యం మత్తులో చంద్రబాబును దూషించడంతో అక్కడే ఉన్న వెంకటనారాయణ వారిని అడ్డుకున్నాడు. జగన్ వచ్చిన తర్వాతే మద్యం ధరలు విపరీతంగా పెరిగాయని, చంద్రబాబు ఉన్నప్పుడు ఇంత విచ్చలవిడితనం లేదని అన్నాడు. మాకే ఎదురు సమాధానం చెబుతావా? అంటూ వెంకటనారాయణపై మద్యం సీసాలతో దాడి చేసి పెట్రోల్‌ పోసి తగలబెట్టే యత్నం చేశారు. దీంతో స్పృహ కోల్పోయిన వెంకటనారాయణను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


పెదనందిపాడు మండలం, కొప్పర్రుకు చెందిన వెంకటనారాయణ సోమవారం పెద్దకుర్రపాడు అత్తగారింటికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. బాధితుడు దళిత సామాజిక వర్గానికి చెందిన టీడీపీ కార్యకర్త. ఈ ఘటనపై టీడీపీతోపాటు అన్ని వర్గాలకు చెందిన దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-12-21T19:41:58+05:30 IST