గుంటూరులో కరోనా హాట్ స్పాట్‌గా ఎగ్జిబిషన్

ABN , First Publish Date - 2022-01-17T19:43:25+05:30 IST

గుంటూరు: కరోనా కేసులు గుంటూరులో విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే అధికారుల తీరు...

గుంటూరులో కరోనా హాట్ స్పాట్‌గా ఎగ్జిబిషన్

గుంటూరు: కరోనా కేసులు గుంటూరులో విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. గుంటూరులో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ కరోనా హాట్ స్పాట్‌గా మారింది. కొత్తపేట గుంట గ్రౌండ్‌లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. కరోనా పెరుగుతున్న సమయంలో వేలాదిమంది ప్రజలు ఈ ఎగ్జిబిషన్‌కు వస్తున్నారు. ఒకేచోట గుమిగూడి ఉండడంతో కరోనా అధికమవుతోంది. కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతుండగా.. గుంటూరులో మాత్రం భిన్నంగా పరిస్థితులు ఉన్నాయి.


స్వయంగా హోంమంత్రి సుచరిత, స్థానిక ఎమ్మెల్యే ఈ ఎగ్జిబిషన్ ప్రారంభించడం విమర్శలకు దారితీస్తోంది. గుంటూరు నడిబొడ్డున ఉన్న ఈ ఎగ్జిబిషన్‌కు రోజూ వేలాది మంది ప్రజలు.. ముఖ్యంగా చిన్న పిల్లలు వస్తుండడం ప్రమాదానికి నిలయంగా మారింది. దీంతో కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. చాలా మంది కనీసం మాస్కులు కూడా పెట్టుకోవడంలేదు. ఇంత ప్రమాదకర పరిస్థితులు ఉన్నప్పటికీ అధికారులు దృష్టి పెట్టడంలేదు. ఎగ్జిబిషన్ నిర్వాహకులు మాత్రం సంపాదనే ధ్యేయంగా ఉన్నారు.

Updated Date - 2022-01-17T19:43:25+05:30 IST