గుంటూరు వైసీపీ నగర అధ్యక్షుడు రమేష్గాంధీ కన్నుమూత
ABN , First Publish Date - 2021-04-08T23:17:50+05:30 IST
వైసీపీ నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్గాంధీ కన్నుమూశారు. ఆయన కరోనాతో కొద్ది రోజులుగా హైదరాబాద్లో
గుంటూరు: వైసీపీ నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్గాంధీ కన్నుమూశారు. ఆయన కరోనాతో కొద్ది రోజులుగా హైదరాబాద్లో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఈ రోజు కన్నుముశారు. ఇటీవల జరిగిన గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల్లో 6 వార్డు కార్పోరేటర్గా గాంధీ గెలిచారు. గాంధీ కార్పోరేటర్గా ప్రమాణస్వీకారం కూడా చేయలేదు. రమేష్గాంధీ మృతితో వైసీపీ శ్రేణులు శోకసంధ్రంలో మునిగిపోయారు. గాంధీ మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.