గుంటూరు జిల్లాలో ఫ్లెక్సీల వివాదం

ABN , First Publish Date - 2022-01-24T17:46:25+05:30 IST

జిల్లాలోని నరసరావుపేట మండలం కేసానుపల్లిలో ఫ్లెక్సీల వివాదం కొనసాగుతుంది. నిన్న టీడీపీ ఫ్లెక్సీలకువైసీపీ వర్గీయులు నిప్పుపెట్టారు.

గుంటూరు జిల్లాలో ఫ్లెక్సీల వివాదం

గుంటూరు: జిల్లాలోని నరసరావుపేట మండలం కేసానుపల్లిలో ఫ్లెక్సీల వివాదం కొనసాగుతుంది. నిన్న టీడీపీ ఫ్లెక్సీలకువైసీపీ వర్గీయులు నిప్పుపెట్టారు. ఇవాళ మరికొన్ని ఫ్లెక్సీలను చించేందుకు వైసీపీ శ్రేణులు యత్నించారు. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్తలను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. వైసీపీ వర్గీయులతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. 

Updated Date - 2022-01-24T17:46:25+05:30 IST