గురుకులంలో ప్రవేశాలకు పరీక్షలు

ABN , First Publish Date - 2021-08-02T05:46:39+05:30 IST

స్థానిక సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్‌ గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశానికి ఆదివారం నిర్వహించిన కామన్‌ ఎంట్రెన్స్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించారు.

గురుకులంలో ప్రవేశాలకు పరీక్షలు


కంభం, ఆగస్టు 1 : స్థానిక సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్‌ గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశానికి ఆదివారం నిర్వహించిన కామన్‌ ఎంట్రెన్స్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించారు. రెసిడెన్షియల్‌ గురుకుల పాఠశాలలో నిర్వహించిన ఏపీజీపీ సెట్‌ పరీక్షలో 137 మందికి గాను 122 మంది విద్యార్థులు హాజరు కాగా 15 మంది గైరుహాజరైనట్లు పరీక్షల సూపరింటెండెంట్‌, ప్రిన్సిపాల్‌ చాముండేశ్వరి తెలిపారు. కార్యక్రమంలో పరిశీలకులు రూత్‌రమోలా, సీఆర్పీ రవీంద్రనాయక్‌ ఉన్నారు.


Updated Date - 2021-08-02T05:46:39+05:30 IST