‘సంగం’ కేసులో గురునాథానికి బెయిల్
ABN , First Publish Date - 2021-05-08T08:53:16+05:30 IST
సంగం డెయిరీ కేసులో మూడో నిందితుడిగా ఉన్న విశ్రాంత అధికారి గురునాథానికి విజయవాడ ఏసీబీ కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది
విజయవాడ, మే 7 (ఆంధ్రజ్యోతి): సంగం డెయిరీ కేసులో మూడో నిందితుడిగా ఉన్న విశ్రాంత అధికారి గురునాథానికి విజయవాడ ఏసీబీ కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఏ-1గా చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్, ఏ2గా ఎండీ పి.గోపాలకృష్ణన్లకు బెయిల్ మంజూరు చేయాలని కొద్దిరోజుల క్రితం వారి తరపున న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు ముగిసిన అనంతరం న్యాయమూర్తి ఒక్క గురునాథానికి మాత్రమే బెయిలిచ్చారు.