గుట్కా, గంజాయి విక్రయిస్తే కఠినచర్యలు
ABN , First Publish Date - 2021-10-24T04:29:33+05:30 IST
పాన్షాప్లలో గుట్కా, గంజాయి విక్ర యిస్తే కఠినచర్యలు తీసుకుంటామని ఎస్పీ(అడ్మిన్) వైవీఎస్ సుదీంద్ర అన్నారు. శనివారం సాయంత్రం పట్టణంలోని పలు పాన్షాప్లను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిషేధిత గుట్కావిక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
- ఎస్పీ(అడ్మిన్) వైవీఎస్ సుదీంద్ర
ఆసిఫాబాద్ రూరల్, అక్టోబరు 23: పాన్షాప్లలో గుట్కా, గంజాయి విక్ర యిస్తే కఠినచర్యలు తీసుకుంటామని ఎస్పీ(అడ్మిన్) వైవీఎస్ సుదీంద్ర అన్నారు. శనివారం సాయంత్రం పట్టణంలోని పలు పాన్షాప్లను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిషేధిత గుట్కావిక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే రైతులు తమ పంటపొలాల్లో గంజాయి సాగు చేయవద్దన్నారు. గంజాయి సాగుచేస్తే రైతుబీమా, రైతుబంధును ప్రభుత్వం నిలిపివేస్తుందన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ శ్రీనివాస్, సీఐ అశోక్ ఉన్నారు.
కాగజ్నగర్లో..
కాగజ్నగర్ టౌన్: శనివారం రాత్రి కాగజ్నగర్ పట్టణంలోని పలు కూడళ్లలోని పాన్టేలాలను ఎస్పీ వైవీఎస్ సుదీంద్ర తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గంజాయి, ఇతర నిషేధిత మత్తు పదార్థాలు అమ్మకాలు జరిపితే ఊరుకునేది లేదన్నారు. ఎంతటి వారిపైనయినా కూడా కేసులు నమోదు చేస్తామన్నారు. ఆయనవెంట డీఎస్పీ కరుణాకర్, పట్టణ ఇన్చార్జీ సీఐ రాజేంద్రప్రసాద్ ఉన్నారు.
మండలాల్లో తనిఖీలు..
కౌటాల/దహెగాం/బెజ్జూరు/ సిర్పూర్(టి): కౌటాల, దహెగాం, బెజ్జూరు, సిర్పూర్(టి) మండల కేంద్రా ల్లోని పలుదుకాణాలు, పాన్టేలాల్లో శనివారం పోలీ సులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిషేధితగుట్కా, ఖైనీఅమ్మకాలు చేయవ ద్దని,గంజాయిరహిత ప్రాంతంగామార్చేందు అందరూ సహకరించాలన్నారు. ఆయా మండలాల్లో జరిగిన కార్యక్రమాల్లో కౌటాల ఎస్సై ఆంజనేయులు, దహెగాం ఎస్సై రఘుపతి, బెజ్జూరు ఎస్సై సాగర్, సిర్పూర్(టి) ఎస్సై బుద్ధే స్వామి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.