రూ.20 లక్షల గుట్కా స్వాధీనం

ABN , First Publish Date - 2021-12-07T05:02:39+05:30 IST

తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి ద్వారకానగర్‌లో రూరల్‌ పోలీసులు రూ.20లక్షల విలువ చేసే నిషేధిత గుట్కా నిల్వలను సోమవారం స్వాధీనం చేసుకున్నారు.

రూ.20 లక్షల గుట్కా స్వాధీనం
సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ

తాడేపల్లిగూడెం రూరల్‌, డిసెంబరు 6: తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి ద్వారకానగర్‌లో రూరల్‌ పోలీసులు రూ.20లక్షల విలువ చేసే నిషేధిత గుట్కా నిల్వలను సోమవారం స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ బి.శ్రీనాథ్‌ సంఘటనా స్థలాన్ని పరిశీ లించారు. సర్కిల్‌ కార్యాలయంలో ఏ ర్పాటు చేసిన కార్యక్రమంలో వివరాలు తెలిపారు. తాడేపల్లిగూడెంకు చెందిన గుట్కా వ్యాపారులు మిరియాల సురే ష్‌ కుమార్‌, మానేపల్లి సతీష్‌ కుమార్‌ ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నిషేధిత గుట్కా నిల్వలతోపాటు గోవా రాష్ట్రానికి చెందిన ఎనిమిది మద్యం సీసాల ను కూడా స్వాధీనం చేసుకున్నారు. గుట్కా నిల్వలు పట్టుకున్న సీఐ వీరా రవికుమార్‌, ఎస్‌ఐ ఎన్‌.శ్రీనివాస్‌, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

Updated Date - 2021-12-07T05:02:39+05:30 IST