రూ.71,850 విలువైన గుట్కా ప్యాకెట్లు సీజ్
ABN , First Publish Date - 2022-01-28T04:38:53+05:30 IST
పట్టణ సమీపంలోని బాలయోగి గురుకుల పాఠశాల వద్ద రూ. 71,850 విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ భాస్కర్రెడ్డి తెలిపారు.
పులివెందుల టౌన్, జనవరి 27: పట్టణ సమీపంలోని బాలయోగి గురుకుల పాఠశాల వద్ద రూ. 71,850 విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ భాస్కర్రెడ్డి తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు ఎస్ఐ గోపీనాథ్రెడ్డి, ఎస్బీ హెడ్కానిస్టేబుల్ రాజేశ్వరరెడ్డి, సిబ్బందితో కలిసి గురువారం బాలయోగి గురుకుల పాఠశాల వద్ద తనిఖీలు చేపట్టగా బొలెరో పికప్ వాహనంలో కర్ణాటక రాష్ట్రం నుంచి వేంపల్లెకు తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను సీజ్ చేశామన్నారు. వేంపల్లె, చక్రాయపేట మండలాలకు చెందిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేశామన్నారు. మొత్తం 19,035 ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.