గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

ABN , First Publish Date - 2020-12-04T04:42:12+05:30 IST

రాజంపేట పట్టణంలో గురువారం రూ.30 వేల విలువజేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు మన్నూరు సీఐ సురేందర్‌రెడ్డి తెలిపారు.

గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
వివరాలు వెల్లడిస్తున్న సీఐ

రాజంపేట, డిసెంబరు 3 : రాజంపేట పట్టణంలో గురువారం రూ.30 వేల విలువజేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు మన్నూరు సీఐ సురేందర్‌రెడ్డి తెలిపారు. గురువారం మన్నూరు పోలీ్‌సస్టేషన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ గుట్కా ప్యాకెట్లు విక్రయించే ఇరువురిపై కేసు నమోదు చేసి ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలిపారు. గుట్కాను ఇతర ప్రాంతాల్లో తక్కువ ధరలకు కొనుగోలు చేసి రాజంపేట ప్రాంతంలో ఎక్కువ రేట్లకు అమ్ముతుండగా భూమన వెంకటేష్‌ అనే వ్యక్తిని అరెస్టు చేశామన్నారు. ఇందులో భాగంగా మరో వ్యక్తి ఆదిత్యపై కూడా కేసు నమోదు చేశామన్నారు. సమావేశంలో ఎస్‌ఐ రోషన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-04T04:42:12+05:30 IST