రూ.14.75లక్షల Gutkha స్వాధీనం

ABN , First Publish Date - 2021-10-23T12:16:14+05:30 IST

కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నుంచి లారీలో అక్రమంగా తరలిస్తున్న రూ.14.75లక్షల విలువైన గుట్కా, పొగాకు ఉత్పత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి కోయంబత్తూరుకు లారీలో గుట్కా తరలిస్తున్నట్లు

రూ.14.75లక్షల Gutkha స్వాధీనం

చెన్నై(Tamilnadu): కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నుంచి లారీలో అక్రమంగా తరలిస్తున్న రూ.14.75లక్షల విలువైన గుట్కా, పొగాకు ఉత్పత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి కోయంబత్తూరుకు లారీలో గుట్కా తరలిస్తున్నట్లు కోయం బత్తూరు డీఎస్పీ శ్రీఅభినవ్‌కు సమాచారం అందింది. దీంతో ఓమలూరు డీఎస్పీ సంగీత పర్యవేక్షణలో హైవే ఎస్‌ఐ పెరియసామి నాయకత్వంలో పోలీసులు ఓమలూరు కమలాపురం జంక్షన్‌ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో వేగంగా వెళ్తున్న మినీ లారీని పోలీసులు అడ్డుకున్నారు. వారిని చూడగానే లారీ డ్రైవర్‌ పారిపోయాడు. పోలీసులు ఆ లారీ పరిశీలించగా 40 బస్తాల్లో 1175 కేజీల గుట్కా, పొగాకు వస్తువులు లభించాయి. వాటి వస్తువుల విలువ రూ. 14.75లక్షలుంటుందని పోలీసు అధికారులు తెలిపారు. మినీలారీలో ప్రయాణించిన క్లీనర్‌ కార్తీక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. అతడిచ్చిన సమా చారం మేరకు పారిపోయిన లారీ డ్రైవర్‌ మేచ్చేరి ఉప్పా రపట్టికి చెందిన మురుగన్‌ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Updated Date - 2021-10-23T12:16:14+05:30 IST