Nallagonda: తెలంగాణపై కేంద్రం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోంది: గుత్తా

ABN , First Publish Date - 2021-07-18T16:36:17+05:30 IST

తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు.

Nallagonda: తెలంగాణపై కేంద్రం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోంది: గుత్తా

నల్లగొండ: తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని శాసన మండలి మాజీ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. ఆదివారం నల్లగొండలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ నది జలాలకు సంబంధించి గెజిట్  విడుదల చేయడం దారుణమన్నారు. తెలంగాణను ఎడారిగా మార్చాలని కేంద్రం కుట్ర పన్నిందని మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని గ్రహించి కక్ష పెట్టుకొని కేంద్రం ఇలా వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రంలో బీజేపీ నాయకులను నిలదీయాలని గుత్తా సుఖేందర్ రెడ్డి  అన్నారు.

Updated Date - 2021-07-18T16:36:17+05:30 IST