రైతులను పరామర్శించిన జీవీ ఆంజనేయులు

ABN , First Publish Date - 2021-06-22T17:28:50+05:30 IST

ఈపూరు మండలం అంగలూరులో రైతులను టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు పరామర్శించారు. రైతు ఇళ్లల్లో దాన్యం నిల్వలను పరిశీలించారు

రైతులను పరామర్శించిన జీవీ ఆంజనేయులు

గుంటూరు : ఈపూరు మండలం అంగలూరులో రైతులను టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు పరామర్శించారు. రైతు ఇళ్లల్లో దాన్యం నిల్వలను పరిశీలించారు. వరి పంట రైతుల ఇంటికి వచ్చి రెండు నెలలు అయిందని.. ధాన్యం కొనే నాధుడే లేడని జీవీ ఆంజనేయులు వద్ద రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ.. ప్రభుత్వం కూడా అధికార పార్టీకి మద్దతుగా నిలుస్తోందన్నారు. రైతుల వద్దే కోనుగోలు చేస్తోందన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కూడా పక్షపాతం చూపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని... రైతుల కన్నీటితో ఈ ప్రభుత్వ కొట్టుకుపోవడం ఖాయమని జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. 

Updated Date - 2021-06-22T17:28:50+05:30 IST