ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు దోపిడిలకు పాల్పడుతున్నారు: జీవీ ఆంజనేయులు

ABN , First Publish Date - 2021-06-12T02:28:17+05:30 IST

వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు దోపిడిలకు పాల్పడుతున్నారని వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆరోపించారు.

ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు దోపిడిలకు పాల్పడుతున్నారు: జీవీ ఆంజనేయులు

గుంటూరు: వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు దోపిడిలకు పాల్పడుతున్నారని  వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆరోపించారు.  శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేదలకు ఇళ్ల స్థలాలు పేరుతో బ్రహ్మనాయుడు కోట్లాది రూపాయలు దోచుకున్నారని మండిపడ్డారు. తాజాగా ఇసుక దోపిడికి పాల్పడుతున్నారన్నారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెడతామని బ్రహ్మనాయుడు బెదిరిస్తున్నారన్నారు.  పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ పెద్ద కుంభకోణమన్నారు. వినుకొండ ఎమ్మెల్యే దోపిడిలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి, సీఎం జగన్‌కు వాటాలు ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆంజనేయులు పేర్కొన్నారు.

Updated Date - 2021-06-12T02:28:17+05:30 IST