జీవీకే రూ.23 కోట్ల ప్రాపర్టీ డీల్‌

ABN , First Publish Date - 2021-07-28T06:53:43+05:30 IST

జీవీకే గ్రూప్‌ అధిపతి జీవీ కృష్ణా రెడ్డి తాజాగా ఖరీదైన ఇల్లు కొనుగోలు చేశారు. హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌ ప్రాంతంలో 6,033 చదరపు అడుగుల గృహాన్ని రూ.23.15 కోట్లకు దక్కించుకున్నట్లు జాప్‌కీ.కామ్‌ వెల్లడించింది.

జీవీకే  రూ.23 కోట్ల ప్రాపర్టీ డీల్‌

హైదరాబాద్‌: జీవీకే గ్రూప్‌ అధిపతి జీవీ కృష్ణా రెడ్డి తాజాగా ఖరీదైన ఇల్లు కొనుగోలు చేశారు. హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌ ప్రాంతంలో 6,033 చదరపు అడుగుల గృహాన్ని రూ.23.15 కోట్లకు దక్కించుకున్నట్లు జాప్‌కీ.కామ్‌ వెల్లడించింది. ఈ నెల 16న రిజిస్ట్రేషన్‌ పూర్తయింది. ఈ ప్రాపర్టీ మొత్తం స్థలం 1,447 చదరపు గజాలు. అంటే, ఒక్కో గజానికి దాదాపు రూ.1.60 లక్షలు చెల్లించారు. జీవీకే ఈ ప్రాంతంలో కొనుగోలు చేసిన రెండో ప్రాపర్టీ ఇది. 

Updated Date - 2021-07-28T06:53:43+05:30 IST