విధులకు హాజరైన జీవీఎంసీ కమిషనర్‌

ABN , First Publish Date - 2021-05-18T05:12:12+05:30 IST

గత 15 రోజులుగా విధులకు దూరంగా ఉన్న జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన సోమవారం తిరిగి విధులకు హాజరయ్యారు.

విధులకు హాజరైన జీవీఎంసీ కమిషనర్‌
సమీక్షలో పాల్గొన్న డాక్టర్‌ సృజన

విశాఖపట్నం, మే 17(ఆంధ్రజ్యోతి): గత 15 రోజులుగా విధులకు దూరంగా ఉన్న జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన సోమవారం తిరిగి విధులకు హాజరయ్యారు. కమిషనర్‌తోపాటు ఆమె ఏడాది వయస్సున బాబుకి ఈ నెల రెండున కరోనా సోకింది. దీంతో ఆమె ఇంటి నుంచే అధికారిక కార్యకలాపాలను పర్యవేక్షించేవారు. సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవడంతో సోమవారం ఆమె విధులలో చేరారు. నగరంలోని అన్ని అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో వైద్యుల నియామకం, వ్యాక్సినేషన్‌ నిర్వహణ వంటి అంశాలపై అదనపు కమిషనర్‌ డాక్టర్‌ వి.సన్యాసిరావు, ప్రధాన వైద్యాధికారి డాక్టర్‌ శాస్త్రి, ఇతర అధికారులతో సమీక్షించారు. అన్ని అర్బన్‌ హెల్త్‌ సెంటర్లను గూగుల్‌ మ్యాపింగ్‌ చేసి ఆన్‌లైన్‌లో నగరవాసులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. 


Updated Date - 2021-05-18T05:12:12+05:30 IST