కొత్త ప్రాజెక్టు అంశాలపై భేటీ

ABN , First Publish Date - 2020-12-04T05:41:30+05:30 IST

బ్రిటీష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ డాక్టర్‌ ఆండ్రూ ప్లెమింగ్‌తో జీవీఎసీ కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన గురువారం వర్చువల్‌ సమావేశం నిర్వహించారు.

కొత్త ప్రాజెక్టు అంశాలపై భేటీ
సమావేశంలో పాల్గొన్న జీవీఎంసీ కమిషనర్‌ సృజన

- బ్రిటీష్‌ డిప్యూటీ హైకమిషనర్‌తో జీవీఎంసీ కమిషనర్‌ వర్చువల్‌ సమావేశం


వెంకోజీపాలెం, డిసెంబరు 3: బ్రిటీష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ డాక్టర్‌ ఆండ్రూ ప్లెమింగ్‌తో జీవీఎసీ కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన గురువారం వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. యూకే ప్రభుత్వం ఆధ్వర్యంలో భారత్‌లో క్లైమేట్‌ రీసిల్లెంట్‌ సిటీస్‌ ఫర్‌ ప్రోస్పరిటీ(సీఆర్‌సీపీ) పథకం కింద భారత్‌లో ఐదు నగరాలు లబ్ధి పొందుతుండగా, అందులో విశాఖ నగరం స్థానం పొందింది. ఈ పథకం కింద కార్పొరేషన్‌ పరిధిలోని మధురవాడలో నీటి సేకరణ, భూగర్భ డ్రైనేజీ అభివృద్ధి ప్రాజెక్టు చేపట్టబోతుంది. ఈ ప్రాజెక్టుపై బ్రిటీష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ డాక్టర్‌ ఆండ్రూ ప్లెమింగ్‌తో కమిషనర్‌ చర్చించారు. ఈ సమావేశంలో బ్రిటీష్‌ డిప్యూటీ హైకమిషన్‌ సుష్మా చౌదరి, పైలట్‌ ప్రోగ్రాం మేనేజర్‌ మాటో మెక్‌ డోనాల్డ్‌, కార్పొరేషన్‌ ప్రధాన ఇంజనీర్‌ ఎం.వెంకటేశ్వరరావు, పర్యవేక్షక ఇంజనీర్‌ వినయకుమార్‌, స్మార్ట్‌ సిటీ మేనేజర్‌ ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-04T05:41:30+05:30 IST