జీవీఎంసీ కమిషనర్‌ శారదా పీఠం సందర్శన

ABN , First Publish Date - 2021-12-08T05:19:23+05:30 IST

చినముషిడివాడలోని శారదా పీఠాన్ని జీవీఎంసీ కమిషనర్‌ లక్ష్మీషా మంగళవారం సందర్శించారు.

జీవీఎంసీ కమిషనర్‌ శారదా పీఠం సందర్శన
శారదా పీఠాధిపతి ఆశీస్సులు తీసుకుంటున్న జీవీఎంసీ కమిషనర్‌ లక్ష్మీషా

పెందుర్తి, డిసెంబరు 7: చినముషిడివాడలోని శారదా పీఠాన్ని జీవీఎంసీ కమిషనర్‌ లక్ష్మీషా మంగళవారం సందర్శించారు. పీఠం అధిష్టాన దేవత శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం పీఠాధిపతి స్వరూపానందేంద్రను దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. 

పీఠాధిపతికి వేద పండితుల కృతజ్ఞతలు

దేవదాయశాఖలో విధులు నిర్వహిస్తున్న పలువురు వేద పండితులు మంగళవారం చినముషిడివాడలోని శారదా పీఠాన్ని సందర్శించారు. గ్రేడ్‌- 4గా పనిచేస్తున్న వేద పారాయణ పండితులకు గ్రేడ్‌-3గా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంలో పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి చొరవ ఉండడంతో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా  పీఠాధిపతికి వేద పండితులు కృతజ్ఞతలు తెలిపారు.


Updated Date - 2021-12-08T05:19:23+05:30 IST