కోడలిపై మామ అఘాయిత్యం.. కేసు నమోదు
ABN , First Publish Date - 2021-02-26T15:37:53+05:30 IST
వ్యాపారం నిమిత్తం నగరానికి వచ్చిన యువతిపై తన వెంట వచ్చిన మామే..
హైదరాబాద్/మంగళ్హాట్ : వ్యాపారం నిమిత్తం నగరానికి వచ్చిన యువతిపై తన వెంట వచ్చిన మామే అత్యాచారానికి ఒడిగట్టిన సంఘటన హబీబ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ శివచంద్ర తెలిపిన వివరాల ప్రకారం... ఢిల్లీకి చెందిన మామా(52), కోడలు(21) వస్త్రాల వ్యాపారం చేసేందుకు బుధవారం సాయంత్రం నగరానికి చేరుకున్నారు. మామతో కలిసి యువతి నాంపల్లిలోని ఓ లాడ్జ్లో రూం తీసుకొని బసచేసింది. రాత్రి తనను తన మామే బలవంతం చేశాడని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గురువారం ఉదయం హబీబ్నగర్ పోలీస్ స్టేషన్లో యువతి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.