రూప్‌ జిల్లా అధ్యక్షుడిగా హైదర్‌ బాషా

ABN , First Publish Date - 2021-12-06T05:43:07+05:30 IST

రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్‌ (రూప్‌) జిల్లా అధ్యక్షుడిగా హైదర్‌బాషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

రూప్‌ జిల్లా అధ్యక్షుడిగా హైదర్‌ బాషా
అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హైదర్‌బాషా, రఘునాథ్‌

చిత్తూరు (సెంట్రల్‌), డిసెంబరు 5: రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్‌ (రూప్‌) జిల్లా అధ్యక్షుడిగా హైదర్‌బాషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం స్థానిక పీసీఆర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రూప్‌ జిల్లా కార్యవర్గ సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర కౌన్సిలర్లుగా రంగన్న, ప్రభాకర్‌రెడ్డి, సలహాదారుడిగా గోవిందయ్య ఎన్నికయ్యారు. జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్‌.రమేష్‌, చంద్రశేఖర్‌రెడ్డి, దేవరాజులు, దొరస్వామి, దత్తాత్రేయ, సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శిగా రఘునాథ్‌, సంయుక్త కార్యదర్శులుగా ఖాదర్‌వల్లి, శంకరయ్య, సుబ్రహ్మణ్యంనాయుడు, గోపినాథ్‌, నారాయణరెడ్డి, సహదేవయ్య, రమేష్‌, మేఘనాథం, మునిరాజులు, సహాయ కార్యదర్శులుగా హరీష్‌, అహమ్మద్‌, మోహన్‌, రమేష్‌, పురుషోత్తం, యుగంధర్‌, భాస్కర్‌, కోశాధికారిగా రఘుపతిని ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిచంద్రకుమార్‌, పరిశీలకులుగా చండ్ర నరే్‌షబాబు, స్వామి, రంగన్న పాల్గొన్నారు.

Updated Date - 2021-12-06T05:43:07+05:30 IST