పోలీసులకు నిందితుల అప్పగింత

ABN , First Publish Date - 2021-04-21T05:42:16+05:30 IST

నకిలీ నాణేల మార్పిడిలో మోసపోయిన బాధితులు వన్‌టౌన్‌ పోలీసుల సాయంతో ముఠా సభ్యులను హైదరాబాద్‌ పోలీసులకు అప్పగించారు.

పోలీసులకు నిందితుల అప్పగింత

మదనపల్లె క్రైం, ఏప్రిల్‌ 20: నకిలీ నాణేల మార్పిడిలో మోసపోయిన బాధితులు వన్‌టౌన్‌ పోలీసుల సాయంతో ముఠా సభ్యులను  హైదరాబాద్‌ పోలీసులకు అప్పగించారు.  కర్ణాటక రాష్ట్రం రాయల్‌పాడుకు చెందిన ముగ్గురు యువకులు గతంలో నాణేలు, బంగారు పూసల పేరుతో  హైదరాబాద్‌కు చెందిన పలువురిని మోసగించి వారినుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేశారు. ఈక్రమంలో ముఠా చేతిలో మోసపోయిన బాధితులు  పోలీస్‌స్టేషన్‌లో కేసుపెట్టారు.  అయితే నిందితులు మదనపల్లెలో ఉన్నట్లు తెలుసుకున్న బాధితులు మంగళవారం ఇక్కడికి చేరుకుని వన్‌టౌన్‌ పోలీసుల సాయం కోరారు. కదిరిరోడ్డులోని టిప్పుసుల్తాన్‌ మసీదు కాంప్లెక్స్‌ వద్ద ముగ్గురి నిందితులను చాకచక్యంగా పట్టుకుని కారులో తీసుకెళ్లి హైదరాబాద్‌ పోలీసులకు అప్పగించారు.

Updated Date - 2021-04-21T05:42:16+05:30 IST