కౌంటీల్లో విహారి
ABN , First Publish Date - 2021-04-07T09:50:44+05:30 IST
భారత టెస్టు క్రికెటర్ హనుమ విహారి కౌంటీ క్రికెట్ ఆడబోతున్నాడు. వార్విక్షైర్ తరఫున ఈ ఆంధ్ర కెప్టెన్ కనీసం మూడు మ్యాచ్లను ఆడబోతున్నట్టు సమాచారం...
న్యూఢిల్లీ: భారత టెస్టు క్రికెటర్ హనుమ విహారి కౌంటీ క్రికెట్ ఆడబోతున్నాడు. వార్విక్షైర్ తరఫున ఈ ఆంధ్ర కెప్టెన్ కనీసం మూడు మ్యాచ్లను ఆడబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే తను లండన్ చేరుకున్నాడు. ఐపీఎల్లో రెండేళ్లుగా అతడిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడం లేదు. అయితే ఇంగ్లండ్లోనే జరుగబోయే ఆరు టెస్టులకు ఈ కౌంటీ సీజన్ను విహారి సన్నాహకంగా ఉపయోగించుకోనున్నాడు. విహారి కౌంటీల్లో ఆడే విషయాన్ని బీసీసీఐ కూడా ధ్రువీకరించింది. అయితే వార్విక్షైర్ జట్టు మాత్రం అధికారికంగా ఇంకా అతడి పేరును ప్రకటించలేదు.