కన్నుల పండువగా హనుమంత వాహన సేవ

ABN , First Publish Date - 2021-04-22T06:41:00+05:30 IST

శ్రీరామనవమి సందర్భంగా తిరుమలలో బుధవారం హనుమంత వాహన సేవ కన్నుల పండువగా జరిగింది.

కన్నుల పండువగా హనుమంత వాహన సేవ
హనుమంత వాహనంపై విహరిస్తున్న శ్రీరామచంద్రమూర్తి

తిరుమల, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): శ్రీరామనవమి సందర్భంగా తిరుమలలో బుధవారం హనుమంత వాహన సేవ కన్నుల పండువగా జరిగింది. శ్రీరామనవమిని పురస్కరించుకుని ఉదయం తొమ్మిది నుంచి 11 గంటల వరకు సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయస్వామికి శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపలో స్నపన తిరుమంజనం జరిగింది. రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు హనుమంత వాహనసేవ నిర్వహించారు. శ్రీరామచంద్రమూర్తి అవతారంలో శ్రీవారు హనుమంతుడిపై కొలువుదీరి నాలుగుమాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. తర్వాత శ్రీవారి ఆలయంలోని బంగారువాకిలి వద్ద శ్రీరామనవమి ఆస్థానాన్ని శాస్ర్తోక్తంగా నిర్వహించారు. కాగా, గురువారం సాయంత్రం ఐదు గంటలకు వైభోత్సవ మండపంలో సహస్రదీపాలంకరణ సేవ, రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్యలో బంగారువాకిలి వద్ద అర్చకులు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించనున్నారు.

Updated Date - 2021-04-22T06:41:00+05:30 IST