ఏబీఎన్ ప్రతినిధిపై దాడిని ఖండిస్తున్నా: వీహెచ్

ABN , First Publish Date - 2021-03-06T15:27:42+05:30 IST

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి భూ కబ్జాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని..

ఏబీఎన్ ప్రతినిధిపై దాడిని ఖండిస్తున్నా: వీహెచ్

వరంగల్: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి భూ కబ్జాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. శనివారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ భూ కబ్జాలను ప్రశ్నించేందుకు వచ్చిన ఏబీఎన్ ప్రతినిధిపై దాడికి ఉసిగొల్పడం అమానుషమని, దానిని ఖండిస్తున్నామన్నారు. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కబ్జాలపై వారంలోగా ముఖ్యమంత్రి కేసీఆర్ కమిటీ వేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. లేదంటే ఇక్కడ నుంచే నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.


 పోతారంలో దెయ్యాలున్నాయని చెప్పి భయపెట్టి దళితుల భూములను కబ్జాచేయాలనుకోవడం ముత్తిరెడ్డి కబ్జాలకు పరాకాష్ఠని వీహెచ్ అన్నారు.

Updated Date - 2021-03-06T15:27:42+05:30 IST