హరప్పా ఎడ్యుకేషన్ 'హీరోస్' వీరే!
ABN , First Publish Date - 2020-10-05T22:18:24+05:30 IST
ప్రముఖ ఆన్లైన్ అభ్యాస వేదిక హరప్పా ఎడ్యుకేషన్, తమ రెండో దశ డిజిటల్ కార్యక్రమం హరప్పా హ్యాబిట్ హీరోస్ విజేతలను సోమవారం వెల్లడించింది. దాదాపు 2వేల నామినేషన్ల..
న్యూఢిల్లీ: ప్రముఖ ఆన్లైన్ అభ్యాస వేదిక హరప్పా ఎడ్యుకేషన్, తమ రెండో దశ డిజిటల్ కార్యక్రమం హరప్పా హ్యాబిట్ హీరోస్ విజేతలను సోమవారం వెల్లడించింది. దాదాపు 2వేల నామినేషన్ల నుంచి ఐదుగురు విద్యావేత్తలను ఎంపిక చేయడం జరిగింది. మహమ్మారి విజృంభణ వేళ ఆన్లైన్ విద్యా రంగంలో గణనీయమైన మార్పులను తీసుకురావడంలో వీరు ఎనలేని కృషి చేశారు. వారిలో అర్జూ రిఖివా 3వ తరగతి పిల్లలకు బోధిస్తుండగా, సునీల్ భఖరీ 6 నుంచి 10వ తరగతి పిల్లలకు విద్యనేర్పుతున్నారు. అలాగే అంజలి దద్వాల్ ప్రీస్కాలర్ లకు విద్యానందిస్తుండగా, షిప్రా భారతీయ ప్రైమరీ విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. ఇక నిషా జైన్ గ్రోవర్ సంగీతం, నృత్యం, యోగాలను ఆన్లైన్ లో నేర్పుతున్నారు. వీరంతా నూతన విద్య విధానంలో గొప్పగా పని చేస్తున్నారని, అందుకే వీరిని ఎంపిక చేశామని హారప్పా ఎడ్యుకేషన్ యాజమాన్యం తెలిపింది.