కాంట్రాక్టర్లపై వేధింపులు మానుకోవాలి

ABN , First Publish Date - 2021-10-18T05:06:39+05:30 IST

మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లపై వైసీపీ వేధింపులు మానుకోవాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

కాంట్రాక్టర్లపై వేధింపులు మానుకోవాలి
వెంకటరమణారెడ్డిని పరామర్శిస్తున్న శ్రీనివాసరెడ్డి

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి

కడప, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లపై వైసీపీ వేధింపులు మానుకోవాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సాక్షాత్తు హైకోర్టు ఆదేశించినా వారిలో మార్పు రాలేదని, వారి వేధింపుల కారణంగా బిల్లులు రాక కాంట్రాక్టర్లు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే గాలివీడు మండలం నూలివీడి పంచాయతీకి చెందిన వెంకటరమణారెడ్డి టీడీపీ హయాంలో రూ.20 లక్షల ఉపాధి నిధులతో పనులు చేస్తే బిల్లులు ఇవ్వకుండా వైసీపీ నేతలు అడ్డుకున్నారని, ఆయన మనోవేదనకు గురై గుండపోటు వచ్చిందని ఆరోపించారు. కాగా, కడప నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయనను పరామర్శించారు. 


Updated Date - 2021-10-18T05:06:39+05:30 IST