ఐదు వేల మందికి సాయమందిస్తాం
ABN , First Publish Date - 2020-04-06T09:35:04+05:30 IST
పంజాబ్లోని తన స్వస్థలమైన జలంధర్లో ఐదు వేల మందికి 5 కిలోల బియ్యం, గోధమ పిండి, వంటనూనెతో పాటు ఇతర నిత్యావసర సరుకులు...
ముంబై: పంజాబ్లోని తన స్వస్థలమైన జలంధర్లో ఐదు వేల మందికి 5 కిలోల బియ్యం, గోధమ పిండి, వంటనూనెతో పాటు ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నట్టు హర్భజన్ సింగ్ వెల్లడించాడు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న పేదవారికి సహాయం చేయాలని తాను, తన భార్య గీత నిర్ణయించుకున్నామని తెలిపాడు.