కష్టపడకపోతే తర్వాత బాధపడాల్సి వస్తుంది
ABN , First Publish Date - 2022-02-24T08:13:37+05:30 IST
కష్టపడకపోతే తర్వాత బాధపడాల్సి వస్తుంది. మీ నియోజకవర్గంలో పార్టీ నేతలు నీ పనితీరుపై సంతృప్తిగా లేరు.
కాళహస్తి ఇన్చార్జి సుధీర్కు చంద్రబాబు క్లాస్
అమరావతి, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): ‘‘కష్టపడకపోతే తర్వాత బాధపడాల్సి వస్తుంది. మీ నియోజకవర్గంలో పార్టీ నేతలు నీ పనితీరుపై సంతృప్తిగా లేరు. వైసీపీ పాలనపై ప్ర జలు విసుగెత్తి ఉన్నారు. వారి ఆదరణ పొందేలా పనితీరు మెరుగుపర్చుకోవాలి. ఇంకా కష్టపడాలి’’ అని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి టీడీపీ ఇన్చార్జి బొజ్జల సుధీర్రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు క్లాస్ తీసుకొన్నారు. బుధవారం ఇక్కడ టీడీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ నేత ల సమావేశం జరిగింది. ముందుగా నేతలతో విడివిడిగా మాట్లాడి అక్కడి పరిస్థితులను రాష్ట్ర కార్యాలయ నేతలు అడిగి తెలుసుకొన్నారు. తర్వాత సుధీర్రెడ్డితో చంద్రబాబు విడిగా మాట్లాడారు. ‘‘తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ప్రజల కు అందుబాటులో ఉన్న నేతగా పేరు తెచ్చుకొన్నారు. ఆయ న మాదిరిగా కష్టపడాలి. ఈసారి ఎన్నికల్లో కాళహస్తిలో టీడీపీ గెలవాలన్న బలమైన కోరికతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా నీ పనితీరు ఉండాలి. నేను మళ్లీ మళ్లీ చెప్పను. అర్థం చేసుకొని పనిచేయాలి’’ అని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం.