మరోమారు విఫలమైన Hardik Pandya

ABN , First Publish Date - 2021-07-24T00:43:55+05:30 IST

శ్రీలంకతో జరుగుతున్న చివరి వన్డేలో భారత బ్యాట్స్‌మెన్ తడబడుతున్నారు. వర్షం కారణంగా ఆగిన మ్యాచ్

మరోమారు విఫలమైన Hardik Pandya

కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న చివరి వన్డేలో భారత బ్యాట్స్‌మెన్ తడబడుతున్నారు. వర్షం కారణంగా ఆగిన మ్యాచ్ తిరిగి ప్రారంభమైన తర్వాత భారత జట్టు త్వరత్వరగా మూడు వికెట్లు కోల్పోయింది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మరోమారు విఫలమయ్యాడు. 19 పరుగులు మాత్రమే చేసి జయవిక్రమ బౌలింగులో వికెట్ల ముందు దొరికిపోయాడు. క్రీజులో పాతుకుపోయినట్టు కనిపించిన సూర్యకుమార్ యాదవ్ ఆ తర్వాత కాసేపటికే దనంజయ బౌలింగులో ఎల్బీగా వెనుదిరిగాడు. 37 బంతులు ఎదుర్కొన్న సూర్యకుమార్ 7 ఫోర్లతో 40 పరుగులు చేశాడు. 


భారత జట్టుకోల్పోయిన ఆరు వికెట్లలో మూడు జయవిక్రమకే దక్కడం గమనార్హం. వర్షం కారణంగా ఓవర్లను 47 ఓవర్లకు కుదించారు. ప్రస్తుతం 32 ఓవర్లు ముగిశాయి. భారత్ ఆరు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. నితీశ్ రాణా, కృష్ణప్ప గౌతమ్ క్రీజులో ఉన్నారు. 

Updated Date - 2021-07-24T00:43:55+05:30 IST