హరిద్వార్ కుంభమేళాలో నీటిలో తేలియాడుతున్న రాళ్లు!
ABN , First Publish Date - 2021-04-11T16:25:25+05:30 IST
ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో ప్రస్తుతం...
హరిద్వార్: ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో ప్రస్తుతం కుంభమేళా జరుగుతోంది. ఇక్కడికి వచ్చినవారంతా రామసేతు రాళ్లను దర్శించుకుని ఆశ్చర్యపోతున్నారు. త్రేతాయుగంలో శ్రీరాముని పేరుతో నీటిలో తేలియాడిన రాళ్లు ఇప్పుడు మహాకుంభమేళాలోనూ దర్శనమిస్తున్నాయి. వీటిని చూసేందుకు భక్తులు క్యూ కడుతున్నారు. వీటిని రామసేతు నిర్మాణంలో వినియోగించారని చెబుతుంటారు.
రామాయణంలోని యుద్ధకాండలో రామసేతు నిర్మాణం గురించిన ప్రస్తావన కనిపిస్తుంది. నలుడనే వానరుని సారధ్యంలో కోటిమంది వానరులు ఐదు రోజుల్లో లంకకు వారధిని నిర్మించారని రామాయణంలో పేర్కొన్నారు. ఈ వారధి రామేశ్వరం దగ్గరున్న ధనుష్కోటి నుంచి శ్రీలంక దగ్గరున్న మన్నార్ తీరం వరకూ నిర్మించినట్లు చెబుతుంటారు.