దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడాలి

ABN , First Publish Date - 2020-05-18T11:20:30+05:30 IST

రాష్ట్రంలో జగన్‌ దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్‌ ప్రజలకు పిలుపునిచ్చారు.

దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడాలి

నిరసనలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్‌


కడప (మారుతీనగర్‌), మే 17: రాష్ట్రంలో జగన్‌ దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. డాక్టర్‌ సుధాకర్‌పై ప్రభుత్వ దాడికి నిరసనగా ఆదివారం స్థానిక అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద టీడీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నియంతలా జగన్‌ పాలన సాగిస్తున్నారని, దీంతో అన్ని వర్గాల ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.


ముఖ్యంగా వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని నిప్పులు చెరిగారు. చివరికి ప్రభుత్వ వైద్యులపై కూడా దాడులకు పాల్పడుతున్న తీరు రాక్షస పాలనకు పరాకాష్ట అన్నారు. తదనంతరం అంబేద్కర్‌ విగ్రహానికి ప్రభుత్వం చేసిన దాడికి నిరసనగా వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గోవర్ధనరెడ్డి, జయచంద్ర, మల్లేష్‌, శివరామ్‌, కోదండరామ్‌, రాంప్రసాద్‌, అమీర్‌బాష పాల్గొన్నారు.

Updated Date - 2020-05-18T11:20:30+05:30 IST