హరీష్రావుకు పైసా ఇచ్చే సత్తా లేదు: ఈటల రాజేందర్
ABN , First Publish Date - 2021-09-05T02:21:12+05:30 IST
నిరుద్యోగులకు భృతి ఇస్తామని మూడేళ్లు గడిచాయని, రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఒక్కపైసా అందలేదని మాజీ మంత్రి
జమ్మికుంట: నిరుద్యోగులకు భృతి ఇస్తామని మూడేళ్లు గడిచాయని, రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఒక్కపైసా అందలేదని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ దుయ్యబట్టారు. శనివారం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ ఒక్కో నిరుద్యోగికి కేసీఆర్ లక్ష రూపాయాలు బకాయి ఉన్నారని తెలిపారు. మేనిఫెస్టోలో పెట్టిన నిరుద్యోగ భృతికి ఇప్పటి వరకు దిక్కు, దిశ లేదన్నారు. ఇన్ని మాట్లాడుతున్న ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావుకు ఒక్క పైసా ఇచ్చే సత్తా లేదని ఎద్దేవాచేశారు. తన రాజీనామా వల్లనే కేసీఆర్ ఫామ్హౌస్ వదిలి బయట తిరుగుతున్నారని చెప్పారు. హరీష్రావు ట్రబుల్ షూటర్, ఆరడుగుల బుల్లెట్ అని చెప్పుకుంటారని, అదే నిజం అయితే హుజూరాబాద్లో తన మీద పోటీ చేయాలని ఈటల సవాల్ విసిరారు. ఇక్కడ టీఆర్ఎస్ గెలిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని, తాను గెలిస్తే ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని రాజేందర్ సవాల్ విసిరారు.