కిషన్రెడ్డిపై హరీష్రావు విమర్శలు
ABN , First Publish Date - 2021-11-11T23:44:13+05:30 IST
కేంద్రంమంత్రి కిషన్రెడ్డిపై మంత్రి హరీష్రావు విమర్శలు సంధించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కాలేజీ
హైదరాబాద్: కేంద్రంమంత్రి కిషన్రెడ్డిపై మంత్రి హరీష్రావు విమర్శలు సంధించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కాలేజీ విషయంలో కిషన్రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని తప్పబట్టారు. ఎయిమ్స్కు స్థలం ఇవ్వలేదని బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. బీబీనగర్లో ఎయిమ్స్ కోసం 24 ఎకరాల స్థలం కేటాయించామని తెలిపారు. అబద్ధాలు మాట్లాడిన కిషన్రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వరి, సిలిండర్, కేసీఆర్ కిట్ ఇలా అన్ని అంశాల్లో బీజేపీవి అబద్ధాలేనని చెప్పారు. దుష్ప్రచారంలో బీజేపీ నేతలు గోబెల్స్ను మించిపోతున్నారని హరీష్రావు దుయ్యబట్టారు.