సున్నం రాజయ్యగారి మరణం తీవ్ర దు:ఖాన్ని కలిగించింది: హరీష్‌రావు

ABN , First Publish Date - 2020-08-04T17:18:45+05:30 IST

హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్యను తాను ఎంతగానో గౌరవిస్తానని.. అలాంటి వ్యక్తి మరణం తనకు తీవ్ర దు:ఖాన్ని కలిగించిందని మంత్రి హరీష్‌రావు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

సున్నం రాజయ్యగారి మరణం తీవ్ర దు:ఖాన్ని కలిగించింది: హరీష్‌రావు

హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్యను తాను ఎంతగానో గౌరవిస్తానని.. అలాంటి వ్యక్తి మరణం తనకు తీవ్ర దు:ఖాన్ని కలిగించిందని మంత్రి హరీష్‌రావు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ‘‘నేను అత్యంత గౌరవించే, సున్నం రాజయ్య గారి మరణం తీవ్ర దుఃఖాన్ని కలిగించింది. పేద ప్రజలు, ఆదివాసీలు, గిరిజనులు, దళితుల గొంతుగా జీవితాంతం వారి సమస్యల పరిష్కారం కోసమే బతికిన అసామాన్యుడు. ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల, రాజకీయాల పట్ల జన సామాన్యంలో విశ్వాసం కలిగించిన ఆదర్శ నాయకుడు’’ అని హరీష్‌రావు కొనియాడారు.








Updated Date - 2020-08-04T17:18:45+05:30 IST