బీజేపీ కార్యాలయంలో కుర్చీలు గాల్లోకి ఎగురుతున్నాయ్: హరీశ్‌రావు

ABN , First Publish Date - 2020-11-23T02:33:37+05:30 IST

టికెట్ రాలేదని బీజేపీ ఆఫీస్‌లో దాడులు చేసుకుంటున్నారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రామచంద్రాపురం డివిజన్‌లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ కార్యాలయంలో..

బీజేపీ కార్యాలయంలో కుర్చీలు గాల్లోకి ఎగురుతున్నాయ్: హరీశ్‌రావు

సంగారెడ్డి: టికెట్ రాలేదని బీజేపీ ఆఫీస్‌లో దాడులు చేసుకుంటున్నారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రామచంద్రాపురం డివిజన్‌లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ కార్యాలయంలో కుర్చీలు గాల్లోకి ఎగురుతున్నాయని ఎద్దేవా చేశారు. బీజేపీ ‌నేతల‌ మధ్యే సయోధ్య లేదని,  వీళ్లు ప్రజలకేం సేవ చేస్తారని హరీశ్‌రావు  ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం గుజరాత్‌లో వరదలు వస్తే రూ.500 కోట్లు‌ ఇచ్చిందన్నారు. హైదరాబాద్‌లో వరదలు వస్తే రూపాయి కూడా ఇవ్వలేదని హరీశ్‌రావు విమర్శించారు. 

Updated Date - 2020-11-23T02:33:37+05:30 IST