జూన్ ఆఖరు నుంచి హరితహారం
ABN , First Publish Date - 2020-05-21T08:59:44+05:30 IST
జూన్ నెలాఖరు నుంచి ఆరో విడత హరితహారం ప్రారంభించనున్నట్టు ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు.
వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్
వికారాబాద్ : జూన్ నెలాఖరు నుంచి ఆరో విడత హరితహారం ప్రారంభించనున్నట్టు ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. బుధవారం మండల పరిఽధిలోని నారాయణపూర్ గ్రామంలో నర్సరీని సందర్శించి మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునిసిపాలిటీ, పట్టణాల్లో పెద్ద మొక్కల అవసరం ఎక్కువగా ఉంటుందని, వాటిని తగి న సంఖ్యలో సరఫరా చేసేలా అటవీ అధికారులు పర్యవేక్షించాలన్నారు.
రహదారి వెంట నాటే మొక్కలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో సుభాషిణి, ఎంపీవో, ఏపీవో పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్టీసీ సేవలు పునరుద్ధరించడంతో బుధవారం బస్సుల్లో ప్రయాణికులతో ముచ్చటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ ఖచ్చితంగా మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలని కోరారు.