మూడో టీ20లో హర్మన్‌సేన ఓటమి

ABN , First Publish Date - 2021-10-11T07:39:42+05:30 IST

ఆస్ట్రేలియా మహిళలతో ఆఖరిదైన మూడో టీ20లో భారత్‌ 14 పరుగులతో పోరాడి ఓడింది.

మూడో టీ20లో హర్మన్‌సేన  ఓటమి

గోల్డ్‌కోస్ట్‌: ఆస్ట్రేలియా మహిళలతో ఆఖరిదైన మూడో టీ20లో భారత్‌ 14 పరుగులతో పోరాడి ఓడింది. తొలుత బేత్‌ మూనీ (61) రాణించడంతో ఆసీస్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 149 రన్స్‌ సాధించింది. రాజేశ్వరి 2 వికెట్లు తీసింది. ఛేదనలో టీమిండియా ఓవర్లన్నీ ఆడి 6 వికెట్లకు 135రన్సే చేసింది. ఓపెనర్‌ స్మృతి మంధాన(52) రాణించినా ఓటమి తప్పలేదు. రోడ్రిగ్స్‌ 23, రిచా 23 (నాటౌట్‌) రన్స్‌ చేశారు. దీంతో ఆసీస్‌ 2-0తో సిరీస్‌ దక్కించుకుంది.


సంక్షిప్త స్కోర్లు: ఆస్ట్రేలియా: 20 ఓవర్లలో 149/5 (బేత్‌ మూనీ 61, తహ్లియా మెక్‌గ్రాత్‌ 44 నాటౌట్‌). 

భారత్‌: 20 ఓవర్లలో 135/6 (మంధాన 52, రిచా ఘోష్‌ 23 నాటౌట్‌, జెమీమా రోడ్రిగ్స్‌ 23; క్యారీ 2/42).

Updated Date - 2021-10-11T07:39:42+05:30 IST