ఏపీలో అణచివేత పరిపాలన జరుగుతోంది: హర్షకుమార్
ABN , First Publish Date - 2021-08-06T18:10:15+05:30 IST
ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరుపై మాజీ ఎంపీ హర్షకుమార్ తీవ్ర విమర్శలు చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరుపై మాజీ ఎంపీ హర్షకుమార్ తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏపీలో అణచివేత పరిపాలన కొనసాగుతోందన్నారు. ఎస్సీ, ఎస్టీలను టార్గెట్ చేసిందని ఆరోపించారు. ఏ పొలిటికల్ పార్టీ కూడా ఎస్టీలను టార్గెట్ చేసి పరిపాలన చేయలేదని, ఒక్క వైఎస్సార్సీపీ మాత్రమే ఈ విధంగా చేస్తోందని ఆయన మండిపడ్డారు.
ఇంటర్ ఫీజులను ఏ కార్పొరేట్ కాలేజీ పట్టించుకోవడంలేదని, కార్పొరేట్ కాలేజీలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని హర్షకుమార్ విమర్శించారు. ఎస్సీల పథకాలను ఎత్తివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ ఉన్నా ఎస్సీలకు రుణాలు అందడంలేదని హర్షకుమార్ తీవ్ర స్థాయిలో విమర్శించారు.