రైతులకు మద్దుతు.. పశు అభివృద్ధి బోర్డు నుంచి వైదొలగిన హర్యానా ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2020-12-01T03:20:03+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు హర్యానా ఎమ్మెల్యే సోంబిర్ సంగ్వాన్

రైతులకు మద్దుతు.. పశు అభివృద్ధి బోర్డు నుంచి వైదొలగిన హర్యానా ఎమ్మెల్యే

చండీగఢ్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు హర్యానా ఎమ్మెల్యే సోంబిర్ సంగ్వాన్ మద్దతు పలికారు. రాష్ట్ర పశు అభివృద్ధి బోర్డు చైర్మన్‌గా ఉన్న ఆయన సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. స్వతంత్ర ఎమ్మెల్యే అయిన సోంబిర్ రాష్ట్రంలోని బీజేపీ-జేజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. రాజీనామా అనంతరం ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు లేఖ రాసిన ఎమ్మెల్యే.. రైతులకు మద్దతుగా నిలిచేందుకే తాను తన పదవికి రాజీనామా చేసినట్టు పేర్కొన్నారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టలకు వ్యతిరేకంగా తన అసెంబ్లీ నియోజకవర్గమైన దాద్రి రైతుల సహా దేశం మొత్తం వ్యతిరేకంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో తనపూర్తి మద్దతు రైతులకేనని, అది తన నైతిక విధి కూడా అని సోంబిర్ పేర్కొన్నారు.  

Updated Date - 2020-12-01T03:20:03+05:30 IST