లాక్డౌన్లో అకారణంగా తిరిగేవారికి పోలీసుల వింత శిక్ష
ABN , First Publish Date - 2021-05-04T16:59:09+05:30 IST
కరోనా సెకెండ్ వేవ్తో దేశమంతా తీవ్రంగా పోరాడుతోంది.
చండీగఢ్: కరోనా సెకెండ్ వేవ్తో దేశమంతా తీవ్రంగా పోరాడుతోంది. ఈ నేపధ్యంలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా హరియాణా ప్రభుత్వం మే 10 వరకు పూర్తిస్థాయి లాక్డౌన్ విధించింది. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించినవారికి పోలీసులు వింత శిక్షలు విధిస్తున్నారు. హరియాణాలోని అంబాలాలో లాక్డౌన్ సమయంలో అనవసరంగా బయట తిరుగుతున్నవారికి పోలీసులు క్లాసు పీకారు. అనంతరం గుంజీలు, బస్కీలు తీయించారు. దీనికి సంబంధించిన వీడియోను ఒక వార్త సంస్థ ట్వీట్ చేసింది. దీనిలో పోలీసులు లాక్డౌన్ సమయంలో రోడ్లపై తిరుగుతున్నవారికి శిక్ష విధిస్తున్న దృశ్యం కనిపిస్తుంది.
కనక్ న్యూస్ సౌజన్యంతో....