4 నెలలుగా కేంద్రం, సీబీఐ గాడిదలు కాస్తున్నాయా?

ABN , First Publish Date - 2021-01-18T07:49:09+05:30 IST

‘‘కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని సోము వీర్రాజు బెదిరిస్తే బెదిరిపోవడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వమేమీ చంద్రబాబు ప్రభుత్వం కాదు.

4 నెలలుగా కేంద్రం, సీబీఐ గాడిదలు కాస్తున్నాయా?

  • బెదిరిస్తే బెదరడానికి చంద్రబాబు ప్రభుత్వం కాదు
  • నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చే 
  • పార్టీలు జగన్‌ని బెదిరించలేవు
  • డీజీపీ ప్రకటనను సమర్థిస్తున్నాం
  • చీప్‌ పాలిటిక్స్‌ చేస్తూ సవాంగ్‌పై ఫిర్యాదు చేస్తామంటారా?
  • విద్వేషాలు రెచ్చగొడితే ఎవ్వరినీ ఉపేక్షించం
  • ఎవ్వరికీ భయపడం: వెలంపల్లి 


అమరావతి, జనవరి 17(ఆంధ్రజ్యోతి): ‘‘కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని సోము వీర్రాజు బెదిరిస్తే బెదిరిపోవడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వమేమీ చంద్రబాబు ప్రభుత్వం కాదు. నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చే పార్టీలు సీఎం జగన్‌ను బెదిరించలేవు. తిరుపతి ఉప ఎన్నికల్లో లబ్ధి కోసం సామాజిక మాధ్యమాల ద్వారా మత విద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు’’ అని మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డీజీపీ గౌతం సవాంగ్‌కు లేఖ రాయడాన్ని ఆక్షేపించిన మంత్రి ఈ అంశంపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామనడంపై మండిపడ్డారు. విగ్రహాల ధ్వంసాన్ని డీజీపీ ఆధారాలతో సహా బయటపెట్టారన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నించిన వారిపై కేసులు పెట్టామన్న ఆయన ప్రకటనను తాము సంపూర్ణంగా సమర్థిస్తున్నామని స్పష్టం చేశారు. డీజీపీ .

Updated Date - 2021-01-18T07:49:09+05:30 IST