నాణ్యమైన భోజనం పెట్టండి

ABN , First Publish Date - 2021-02-25T05:22:00+05:30 IST

ఉత్తమ బోధన జరుగుతున్న పాఠశాలలో నాణ్యమైన భోజనం అందడం లేదని, నాణ్యమైన భోజనాన్ని తమ పిల్లలకు వండి పెట్టాలని కోరుతూ పట్టణంలోని కొత్తవలస కొత్తపోలమ్మ మున్సిపల్‌ ఉన్నత పాఠ శాల విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు.

నాణ్యమైన భోజనం పెట్టండి

 విద్యార్థుల తల్లిదండ్రుల డిమాండ్‌ 

పార్వతీపురంటౌన్‌, ఫిబ్రవరి 24: ఉత్తమ బోధన జరుగుతున్న పాఠశాలలో నాణ్యమైన భోజనం అందడం  లేదని, నాణ్యమైన భోజనాన్ని తమ పిల్లలకు వండి పెట్టాలని కోరుతూ పట్టణంలోని కొత్తవలస కొత్తపోలమ్మ మున్సిపల్‌ ఉన్నత పాఠ శాల విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజ న నిర్వహకులు నాణ్యమైన భోజనం పెట్టడం లేదని, వెంటనే వారిని మార్చాలని కో రుతూ  బుధవారం కేపీఎం పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేశా రు. ఇప్పటికే పలుసార్లు మధ్యాహ్నం భోజన నిర్వహకుల తీరుపై విద్యాశాఖాధికారు లు, ప్రజాప్రతినిధులకు తెలియజేసినా పట్టించుకోకపోవడం వల్ల తమ పిల్లలు రోగా ల బారిన పడుతున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఎంఈవో కృష్ణమూర్తిని వివరణ కోరగా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మధ్యాహ్న భోజన నిర్వహకులను మార్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 

==


Updated Date - 2021-02-25T05:22:00+05:30 IST