హెచ్సీయూ భూములపై హైకోర్టు కీలక తీర్పు
ABN , First Publish Date - 2022-01-07T02:31:24+05:30 IST
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం భూములపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. భూములపై హెచ్సీయూకి చట్టబద్ధత హక్కులకు ఆధారాల్లేవని...
నాంపల్లి: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం భూములపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. భూములపై హెచ్సీయూకి చట్టబద్ధత హక్కులకు ఆధారాల్లేవని వెల్లడించింది. భూములపై హక్కుల కోసం సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చునని హెచ్సీయూకి సూచించింది. జీహెచ్ఎంసీ రోడ్డు నిర్మించడాన్ని సవాల్ చేస్తూ హెచ్సీయూ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. హెచ్సీయూకి 1975లో 2324 ఎకరాలను అప్పటి ప్రభుత్వం కేటాయించింది. భూకేటాయింపుపై ఉత్తర్వులు, ఇతర ఆధారాలు లేవని హైకోర్టు స్పష్టం చేసింది.