పీఎమ్ కేర్స్ నిధికి విరాళం.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ద్వారా కూడా సాధ్యమే

ABN , First Publish Date - 2020-04-08T03:36:42+05:30 IST

కరోనా కట్టడి కోసం ధన సహాయం చేయానుకునే వారి కోసం భారత ప్రధాని పీఎమ్ కేర్స్ నిధిని ఏర్పాటు చేశారు. అయితే ఈ నిధి కోసం విరాళాలు సేకరించేందుకు తమకు అనుమతి లభించిందని హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రకటించింది.

పీఎమ్ కేర్స్ నిధికి విరాళం.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ద్వారా కూడా సాధ్యమే

న్యూఢిల్లీ: కరోనా కట్టడికి ధన సహాయం చేయానుకునే వారి కోసం భారత ప్రధాని పీఎమ్ కేర్స్ నిధిని ఏర్పాటు చేశారు. అయితే ఈ నిధి కోసం విరాళాలు సేకరించేందుకు తమకు అనుమతి లభించిందని హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రకటించింది. పీఎమ్ కేర్స్ నిధికి విరాళం ఇవ్వాలనుకున్న వారు తమ బ్యాంకు వెబ్‌సైట్ ద్వారా డొనేషన్లు ఇవ్వొచ్చని బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, యూపీఐల ద్వారా విరాళాలు చెల్లించేందుకు సంస్థ వెబ్‌సైట్‌లో అవకాశం ఉందని బ్యాంకు అధికారులు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. 

Updated Date - 2020-04-08T03:36:42+05:30 IST